
రేపటి నుంచి రైతు మహోత్సవం
నిజామాబాద్అర్బన్: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం నిర్వహించనున నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు శనివారం అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న రైతుమహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొని వారు పండించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని, సహజ పద్ధతుల్లో పంటల సాగు, యాంత్రీకరణ, అధునాతన వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులతోపాటు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 150 వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయం, అను బంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకు లు, స్టార్టప్ కంపెనీలు, ఎఫ్పీవోలు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని పేర్కొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు సాగు రంగంలో అవలంబించాల్సిన ఆధునిక విధానాలు, అధిక దిగుబడుల సాధనకు పాటించాల్సిన పద్ధతులు, పెట్టుబడులను తగ్గించుకోవడం, అధిక లాభాలను అందించే పంటల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రగతిశీల అవార్డు గ్రహీత రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటారని తెలిపారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన రైతు మహోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతు మహోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ కమిషనరేట్ నుంచి హాజరైన ఏడీఏలు హుస్సేన్బాబు, వినోద్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్న శాస్త్రవేత్తలు
సుమారు 150 స్టాళ్ల ఏర్పాటు
గిరిరాజ్ కళాశాల మైదానంలో
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
అధికారులు సమన్వయంతో
పని చేయాలని అధికారులకు ఆదేశం
ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి
సుభాష్నగర్: జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి కోరారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ద్వారా లాభసాటి వ్యవసాయం, రైతుకు అధిక దిగుబడి వచ్చే అంశాలు, డ్రోన్ వ్యవసాయం, వివిధ రకాల వంగడాలకు సంబంధించిన స్టాళ్లు ఉత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గోర్కంటి లింగన్న, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి రైతు మహోత్సవం