నిజామాబాద్ రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం లారీలలో లోడ్ చేసిన తర్వాత అలాట్మెంట్ అయిన రైస్ మిల్లులకు తరలించే లోపు సగం వరి బస్తాలు రోడ్డుపైనే పడిపోతున్నాయి. లారీల పరిమితికి మించి నింపడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ప్రయాణంలో లారీలకు కట్టిన తాడు వదులై సంచులు కిందపడి పగిలిపోయి ధాన్యం రోడ్డుపాలవుతోంది. శుక్రవారం డిచ్పల్లి మండలం ధర్మారం వద్ద, డిచ్పల్లి మండల కేంద్రంలో రెండు లారీల తాడులు తెగిపోవడంతో ధాన్యం బస్తాలు కిందపడిపోయాయి. లారీ డ్రైవర్ గమనించి మళ్లీ ధాన్యం బస్తాలను లోడ్ చేయించాల్సి వచ్చింది. కానీ ఈలోపే స్థానికులు సగం గింజలను మాయం చేశారు. కొన్ని రోడ్డుపైనే పోయాయి. ఈ కారణంగా రైతు నష్టపోవాల్సి వస్తోంది.
లారీలలో పరిమితికి మించి
నింపుతున్న వరి బస్తాలు..
ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్న వైనం
పట్టించుకోని అధికారులు
రైతు కష్టం రోడ్డు పాలు