లీకేజీ నీటిని కిందకు తీసుకురావడానికి ముఠాపూర్, న్యూ వెల్మల్, రాచాపూర్ గ్రామా ల రైతులు సొంత డబ్బులతో టిప్పర్ల ద్వారా మట్టిని తెప్పించి జేసీబీ సహాయంతో వాగులో గండి పడ్డ ప్రదేశంలో పోస్తున్నారు. ఈ విధంగానైనా నీరు కిందకు వస్తే పంటలను కాపాడుకుంటామని, లేకుంటే పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు కాలువలో అక్కడక్కడ ఉన్న నీటిని మోటార్ల వద్దకు తీసుకురావడానికి పారలతో కాలువలు తీసి నీరు ప్రవహించేలా చేస్తూ పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.


