రాధాకృష్ణులుగా
చిన్నారులు
జిల్లాలో శ్రీకష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్, భాగ్యనగర్లోని మురళీకృష్ణ ఆలయాలతోపాటు శాంతినగర్, మంజులాపూర్లోని యాదవ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి. గాంధీచౌక్ మురళీకృష్ణ ఆలయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణులుగా, గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. – నిర్మల్టౌన్


