ఖానాపూర్: ప్రారంభమయ్యే భూముల రీసర్వేకు గ్రామస్తులు సహకరించాలని తహసీల్దార్ సుజాత తెలిపారు. మండలంలోని ఇక్బాల్పూర్, గంగాయిపేట్, కొత్తపేట్ గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించనున్నారు. మంగళవారం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించగా తహసీల్దార్ హాజరై రీసర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. సర్పంచులు, ఉప సర్పంచులు దొనికేని లక్ష్మి, దయానంద్, రెడ్డి లక్ష్మి, నరేందర్, సిద్ధ పల్లవి నరేశ్, దొనికేని వెంకటేశ్, నాయకులు శ్రావణ్, భైరవేణి రాజు, మధు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కడెం: భూసమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తహసీల్దార్ ఖాజామొయినుద్దీన్ అన్నారు. రీసర్వే పైలట్ గ్రామంగా ఎంపికై న మండలంలోని సారంగాపూర్లో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కోల తేజస్వినిశ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


