లోకేశ్వరం: వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని ముధోల్ ఆర్బీఎస్కే వైద్యులు శివకుమార్, అయేషా అన్నారు. మంగళవారం మండలంలోని గడ్చాంద గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని 140 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. నలుగురిని డయాలసిస్ పరీక్షల నిమి త్తం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అనంతరం విద్యార్థుల ఎత్తు, బరువు వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు కాశీరాం(ఉన్నతపాఠశాల), సాయాగౌడ్(ప్రాథమిక పాఠశాల), ఉపాధ్యాయులు మెండె వెంకటరమణ, ముత్తన్న, రవీందర్ ఉన్నారు.


