
డీఈవో రామారావుకు వీడ్కోలు సన్మానం
నిర్మల్ రూరల్: డీఈవో రామారావు స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్ సమావేశమందిరంలో శనివారం సాయంత్రం వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డీటీడీవోఅంబాజీ, జిల్లా ఉన్నతాధికారులు, ఎంఈవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.