అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆసిఫాబాద్, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఏర్పాట్లు చేపట్టారు. ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆలయం ఎదుట మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు


