
అధికారులు పట్టించుకోవడం లేదు
నిర్మల్రూరల్ మండలం కొండాపూర్లో గతంలో ఒక ప్లాటు కొనుగోలు చేశా. దీనికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఫీజు కూడా చెల్లించా. ప్లాటు క్రమబద్ధీకరించుకుందామని డబ్బులు కడదామంటే నాభూమి ఎఫ్టీఎల్లో ఉందని చెప్పారు. అధికారుల చుట్టూ తిరిగి ఎఫ్టీఎల్ లోనుంచి నా భూమిని తొలగించుకున్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డబ్బులు కడదామంటే తొందరేముంది.. నీ ఫైల్ ఎల్–2లాగిన్ లో ఉంది. ఆ లాగిన్ మాకు లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30 తో ముగియనుంది. గడువులోగా చెల్లించకపోతే మాకు రాయితీ రాదు. అధికారులు సమస్య త్వరగా పరిష్కరించాలి. – ఎం.రాజేందర్, నిర్మల్