
భూభారతితో భూములపై హక్కులు
దస్తురాబాద్/పెంబి: భూసమస్యల పరిష్కారం, రైతులకు భూమిపై హక్కుల కల్పన కోసం భూభారతి చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. దస్తురాబాద్, పెంబిలోని రైతు వేదికల్లో మంగళవారం వేర్వేరుగా భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రైతులకు భూదార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. నూతన చట్టంలో తహసీల్దార్ నుంచి సీసీఎల్ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం లభించిందన్నారు. ప్రతీ రైతుకు భూదార్ కార్డు ఇస్తామన్నారు. మండలంలో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన 762 భూముల దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని వెల్ల డించారు. గ్రామ పంచాయతీలలో రెవెన్యూ రికార్డులను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. 470 అసైన్డ్ భూముల సర్వే సమస్యలపై రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రత్యేక సర్వేయర్లతో తిరిగి సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పెంబి మండలంలో నెలకొన్న భూ సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దస్తురాబాద్ మండలం గోడిసీర్యాల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గోడిసీర్యాల గ్రామస్తులు కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి తీసుకురావటంతో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని, రైతులు దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సులో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ సర్ఫరాజ్ నవాజ్, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్గౌడ్, ఎంపీడీవో రమేశ్, డిప్యూటీ తహసీల్దార్లు యాదవరావ్, లక్ష్మణ్, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, సహకారసంఘం చైర్మన్ రామడుగు శైలజ, ఆర్ఐలు ఆర్తి, రచన, ఏవో మానస, ఏఈవో తిరుపతి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎంపీపీ సింగరి కిషన్, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
దస్తురాబాద్, పెంబిలో అవగాహన