అడవులను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

అడవులను సంరక్షించాలి

Apr 23 2025 8:13 AM | Updated on Apr 23 2025 8:49 AM

అడవులను సంరక్షించాలి

అడవులను సంరక్షించాలి

● పీసీసీఎఫ్‌ చంద్రశేఖర్‌రెడ్డి

మామడ: అడవులను సంరక్షిస్తూ పర్యావరణా న్ని కాపాడుకోవాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్స్వరేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌) చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. దిమ్మదుర్తి అటవీ క్షేత్రంలోని తుర్కం, యెంగన్న చెరువులను మంగళవారం పరిశీ లించారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో మొక్క నాటారు. చెరువు సమీపంలో ప్రత్యేక కెమెరాలతో పక్షులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎకోటూరిజం, బర్డ్స్‌వాచ్‌ కోసం సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ చెరువుల వద్దకు వస్తున్నందున ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని, సందర్శకులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అటవీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీసీఎఫ్‌ శర్వాణన్‌, డీఎఫ్‌వో నాగినిభాను, ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఎస్‌వోలు అన్నపూర్ణ, శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement