
ఎస్పీ జానకీ షర్మిల చొరవ
మహిళలు అడవిలో తప్పిపోయారన్న సమాచారం అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. ఏఎస్పీ రాజేశ్మీనా, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు, అటవీశాఖ అధికారుల సహకారంతో గాలింపు చేపట్టారు. సాంకేతికత, డ్రోన్ సాయంతో మహిళలు ఉన్న స్థలాన్ని గుర్తించారు. కాలినడకన, ద్విచక్ర వాహనాలపై దాదాపు ఏడు కిలోమీటర్లు ప్రయాణించి చివరకు వారిని కనుగొ న్నారు. ఎస్పీని చూసిన వెంటనే మహిళలు కన్నీళ్లతో పరుగెత్తుకొచ్చారు. ఎస్పీ వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. నీరసంగా ఉన్న వారికి మంచినీరు, పండ్లు అందించారు. అనంతరం ట్రాక్టర్లో వారితో పాటు ప్ర యాణించి గ్రామానికి సురక్షితంగా తీసుకొచ్చారు. నలుగురినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమవారు క్షేమంగా రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.