ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి

Mar 7 2025 9:33 AM | Updated on Mar 7 2025 9:29 AM

నిర్మల్‌ టౌన్‌: ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని డిపో మేనేజర్‌ ప్రతిమారెడ్డి సూచించారు. ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5 వరకు ఉద్యోగులు డ్యూటీలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు, నిబంధనలపై ప్రొజెక్టర్‌ ద్వారా తరగతులు నిర్వహించారు. గురువారం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యం, సృజనాత్మకతను పెంచడానికి ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఈ సంస్థను సొంత సంస్థగా భావించి పనిచేయాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజశేఖర్‌, ఏఈ నవీన్‌కుమార్‌, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement