భైంసాటౌన్:అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో డివిజన్ పరిధిలో ఆదివారం విజయోత్సవ ర్యాలీలు, సభలు, సంబరాలకు అనుమతి లేదని ఏఎస్పీ కాంతిలాల్పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అలాగే 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా రో డ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపుల కు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment