వ్యవసాయంలో డ్రోన్లపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో డ్రోన్లపై అవగాహన

Jan 4 2026 11:05 AM | Updated on Jan 4 2026 11:05 AM

వ్యవసాయంలో డ్రోన్లపై అవగాహన

వ్యవసాయంలో డ్రోన్లపై అవగాహన

సారంగపూర్‌: మండలంలోని మలక్‌చించోలి గ్రామంలో ఆకిన్‌ అనలెటిక్స్‌ హైదరాబాద్‌ సేవాస్ఫూర్తి ఫౌండేషన్‌, జిల్లా వ్యవసాయ శా ఖల ఆధ్వర్యంలో డ్రోన్‌ ద్వారా పురుగుమందు ల పిచికారిపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌, ఆకిన్‌ అనలెటిక్స్‌ చీఫ్‌ అకడమిక్‌ అధికారి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరికరాల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. డ్రోన్‌ ద్వారా ఎకరా పొలానికి 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలో పురుగు మందులు, ఇతర మందులను పిచికారీ చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. రైతులు ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రత్నాకర్‌, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, మండల వ్యవసాయాధికారి వికార్‌అహ్మద్‌, స్థానిక సర్పంచ్‌ దాసరి విజయ, ఉపసర్పంచ్‌ జ్యోతి, వార్డు సభ్యుడు నవీన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement