25 ఏళ్లకే ఎంపీలుగా రికార్డుకెక్కిన పుష్పేంద్ర, ప్రియా | Youngest Woman Candidate Priya Saroj Won Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

25 ఏళ్లకే ఎంపీలుగా రికార్డుకెక్కిన పుష్పేంద్ర, ప్రియా

Jun 5 2024 8:17 AM | Updated on Jun 5 2024 9:34 AM

Youngest Woman Candidate Priya Saroj Won Lok Sabha Elections

న్యూఢిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన అత్యంత పిన్నవయసు్కలు, అత్యంత వృద్ధుడు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్‌ విజయం సాధించారు. 

వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయసు్కలైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్‌.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్‌.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement