దారుణం: కోడలిని చంపే ప్రయత్నం.. అత్తామామ ఏం చేశారంటే..? | Woman Pushed From Terrace Of Building At Delhi | Sakshi
Sakshi News home page

దారుణం: కోడలిని చంపే ప్రయత్నం.. అత్తామామ ఏం చేశారంటే..?

Jun 19 2022 7:30 PM | Updated on Jun 19 2022 7:31 PM

Woman Pushed From Terrace Of Building At Delhi - Sakshi

దేశంలో మహిళలు, యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కోడలిని అత్తామామ కలిసి.. బిల్డింగ్‌ బాల‍్కనీ నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్‌ చెప్పారు.

వివరాల ప్రకారం.. మయూర్‌ విహార్‌ ప్రాంతంలో ఓ మహిళ(30)ను శనివారం తెల్లవారుజామున తమ అత్తామామలు వారి బిల్డింగ్‌ టెర్రస్‌ నుంచి కిందకు తోసేశారు. ఆమె కింద పడటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 


మరోవైపు.. తన సోదరిని అత్తింటి వారే భవనం పైనుంచి కిందకు తోసేశారని బాధితురాలి సోదరడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులకు అందజేశాడు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్‌కు కూడా పంపించాడు. దీంతో ఆ సంస్థ అధికారిని స్వాతి మలివాల్‌ స్పందించి.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అత్తింటివారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఢిల్లీ తూర్పు జిల్లా డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement