‘ఇంకా ఎక్కువే చేయగలం’: పాక్‌కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక | We could have done more, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

‘ఇంకా ఎక్కువే చేయగలం’: పాక్‌కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

May 29 2025 1:56 PM | Updated on May 29 2025 2:44 PM

We could have done more, says Rajnath Singh

న్యూఢిల్లీ: ‘చేయాలనుకుంటే మనం ఇంకా ఎక్కువే చేయగలం. అయితే ప్రపంచానికి సంయమనం అనే సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే వెనుకకు తగ్గాం. ఒక ఉదాహరణగా నిలిచాం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోమారు పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ, భారతదేశం సంయమనంలో మెలిగిందని, మన సైన్యం ప్రపంచం ఎదుట వ్యూహాత్మక సమన్వయాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు (గురువారం) న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భద్రత, స్వావలంబనలోని ద్వంద్వ లక్ష్యాలను నొక్కిచెప్పారు, భారతదేశ రక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడంలో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవను ఆయన ప్రశంసించారు. తాము మొదట ఉగ్రవాద స్థావరాలను, ఆపై శత్రువుల సైనిక స్థావరాలను, వైమానిక స్థావరాలను ఎలా నాశనం చేశామనేది  అందరూ చూశారన్నారు. మనం ఇంకా ఎక్కువ చేయగలిగినప్పటికీ సంయమనం పాటించామని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారతదేశం నుంచి వచ్చిన సైనిక ప్రతిస్పందన ‘ఆపరేషన్ సిందూర్’ ఒక కొలత కలిగిన నిర్ణయాత్మక దాడి రాజ్‌నాథ్‌ అన్నారు.

భవిష్యత్‌లో పాక్‌తో ఎప్పుడు చర్చలు జరిగినా అవి ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(Pakistan-occupied Kashmir) గురించి మాత్రమే ఉంటాయి. పాకిస్తాన్‌తో మరే ఇతర అంశంపై చర్చ ఉండదని రాజ్‌నాథ్‌ ప్రకటించారు. పీఓకే ప్రజలు మన కుటుంబ సభ్యులు. భౌగోళికంగా, రాజకీయంగా మన నుండి  వేరయిన మన సోదరులు, ఏదో ఒక రోజు వారు ఖచ్చితంగా భారత ప్రధాన స్రవంతిలోకి  తిరిగి వస్తారని గట్టిగా నమ్ముతున్నామని రాజ్‌నాథ్‌ అన్నారు. దశాబ్దాలుగా విడిగా ఉంటున్నప్పటికీ, పీఓకే-భారత ప్రజల మధ్య భావోద్వేగ , సాంస్కృతిక బంధం బలంగా ఉందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement