పరీక్షా కేంద్రంలో బాలిక.. ఊరి ప్రజలంతా అక్కడే.. ఎవరా అమ్మాయి..? | Villagers Tells Good Luck To First Dalit Girl Sits In Matric Exam | Sakshi
Sakshi News home page

పరీక్షా కేంద్రంలో బాలిక.. ఊరి ప్రజలంతా అక్కడే.. ఎవరా అమ్మాయి..?

Feb 19 2022 5:25 PM | Updated on Feb 19 2022 5:26 PM

Villagers Tells Good Luck To First Dalit Girl Sits In Matric Exam - Sakshi

పాట్నా: మన ఇంట్లో ఎవరైనా పరీక్ష రాసేందుకు వెళ్తున్నారంటే కుటుంబ సభ్యులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతారు. కానీ, ఇక్కడ ఓ బాలిక తాను పరీక్ష రాసేందుకు వెళ్తే గ్రామస్తులందరూ ఆమె వెనకే పరీక్షా కేంద్రం వరకు వెళ్లి ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఆమె వెనక్కు తిరిగి.. తన గ్రామస్తులకు చేతులు ఊపుతూ అభివాదం చేసింది. ఆ సమయంలో బాలికను చూసిన ఆ గ్రామస్తులంతా ఆనందంతో తిరిగి అభివాదం చేశారు. ఈ వినూత్న ఘటన బీహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. అధికారుల నిర్లక్ష్యంతో సీతామర్హి జిల్లాలోని డబ్‌ టోల్‌ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. 900 మంది దళిత జనాభా ఉన్న ఆ గ్రామంలో అందరూ కూలి పనులు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి కూడా పదో తరగతి వరకు చదవకపోవడం గమనార్హం. కానీ, కొందరు యువకులు డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకోలేకపోయారు. కాగా, ఇందిరా కుమారి అనే బాలిక ఇటీవలే మంచి మార్కులతో ప్రీ-బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్‌ఈబీ) ఆధ్వర్యంలో మెట్రిక్యులేషన్ పరీక్షకు అర్హత సాధించింది. దీంతో ఆ గ్రామం నుంచి ఈ పరీక్షకు అర‍్హత సాధించిన మొదటి బాలికగా ఇందిర నిలిచింది. కాగా, గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ  సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చదువుకోవడం కోసం ఇందిరా ఎన్నో కష్టాలను అనుభవించిందన్నారు. కష్టాలతో పోరాడింది కానీ చదువును విడిడిపెట్టలేదన్నారు. ఇప్పుడు ఇందిర గ్రామంలోకి ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement