లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. ముగ్గురు మ‌హిళ‌లు మృతి, 24 మందికి గాయాలు | Three Women Dead And 24 Injured As Bus Falls Into Gorge In Uttarakhand, More Details Inside | Sakshi
Sakshi News home page

Dehradun Earthquake: లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. ముగ్గురు మ‌హిళ‌లు మృతి, 24 మందికి గాయాలు

Jun 12 2024 11:08 AM | Updated on Jun 12 2024 12:22 PM

Three women dead, 24 injured as bus falls into gorge in Uttarakhand

డెహ్ర‌డూన్‌: ఉత్త‌రాఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గంగోత్రి జాతీయ ర‌హ‌దారిపై ఉన్న గంంగ‌గ‌నాని స‌మీపంలో బ‌స్సు లోయ‌లో ప‌డింది. డ్రైవ‌ర్ కంట్రోల్ త‌ప్ప‌డంతో ఈ  ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో  ముగ్గురు మ‌హిళ‌లు మ‌ర‌ణించ‌గా.. మ‌రో 24 మందికి గాయాల‌య్యాయి.

గంగ‌నానికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. కంట్రోల్ త‌ప్పిన డ్రైవ‌ర్‌.. వాహ‌నాన్ని క్రాష్ బారియ‌ర్ల‌కు ఢీకొట్టాడు. లోయలో ప‌డి ఓ చెట్టుపై ఆగిపోయింది. గంగోత్రి నుంచి ఉత్త‌ర‌కాశీ వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. 

ప్ర‌మాద స‌మ‌యంలో ఆ బ‌స్సులో 27 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. స‌రైన స‌మ‌యంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గాయ‌ప‌డ్డ‌వారిని ఉత్త‌ర‌కాశీ జిల్లా ఆస్ప‌త్రి, భ‌ట్వాడి హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement