మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో సిట్‌ కీలక పురోగతి | Suspected Of Hiding Evidence, Key Progress On Meghalaya Honeymoon Case | Sakshi
Sakshi News home page

మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో సిట్‌ కీలక పురోగతి

Jun 23 2025 4:27 PM | Updated on Jun 23 2025 5:45 PM

Suspected Of Hiding Evidence, Key Progress On Meghalaya Honeymoon Case

షిల్లాంగ్: మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో సిట్‌ అధికారుల దర్యాప్తులో పురోగతి సాధించారు. పెళ్లైన 11 రోజులకే తన భర్త రాజా రఘు వంశీ హత్య కేసులో సోనమ్‌ రఘువంశీ పాటు ఇతర నిందితుల సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిట్‌ దర్యాప్తులో సోనమ్‌కు సహకరించిన ప్లాటు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.    

నిందితురాలు సోనమ్‌ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత నిందితులు ఇండోర్‌లో ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్‌ యజమాని ఓ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కంపెనీ యజమాని లోకేంద్ర తోమర్‌. అయితే, సోనమ్‌ ఉండేందుకు అద్దె ఇల్లు చూపించిన ప్రాపర్టీ డీలర్ సలోమ్ జేమ్స్‌ను పోలీసులు ప్రశ్నించడంతో లోకేంద్ర తోమర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల దర్యాప్తులో సోనమ్‌ అద్దెకు ఉన్న ఇంటి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, ఆమె ఫోన్, రాజా నగలు, ఐదు లక్షల రూపాయల నగదును తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతేకాదు, జేమ్స్‌ చెప్పిన వివరాల మేరకు.. సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కొద్ది సేపటికే తోమర్.. జేమ్స్‌కు ఫోన్‌ చేశారు. సోనమ్‌ అద్దెకు ఉన్న ప్లాట్‌లో ఓ బ్యాగ్‌ ఉందని, వెంటనే దాన్ని తీసేయాలని కోరాడు. కానీ జేమ్స్‌ ఆ బ్యాగ్‌ను తీయించలేదు. అందుకే తమర్‌ ఆ బ్యాగ్‌ను తీసుకున్నాడు.తన ఫ్లాట్ సమీపంలోని కార్ షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఇండోర్‌లో అతని ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని వర్గాలు తెలిపాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement