మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే | Shivaji Maharaj statue collapse unforgivable, says Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే

Sep 2 2024 4:55 AM | Updated on Sep 2 2024 4:55 AM

Shivaji Maharaj statue collapse unforgivable, says Uddhav Thackeray

శివాజీ విగ్రహం కూలిన ఉదంతంపై పవార్, ఉద్ధవ్‌  

మద్దతుదారులతో ముంబైలో భారీ ర్యాలీ 

ముంబై: సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్‌ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్‌ అఘాడీలోని ఎన్‌సీపీ(ఎస్‌పీ)చీఫ్‌ శరద్‌పవార్, శివసేన(యూబీటీ)చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్‌ నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది.

 ఆగస్ట్‌ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్‌ చేశారు. సింధుదుర్గ్‌లో శివాజీ మహారాజ్‌ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement