నీట్‌ ప్రవేశపరీక్షకు రికార్డు దరఖాస్తులు | Record Applications for NEET Entrance Exam | Sakshi
Sakshi News home page

నీట్‌ ప్రవేశపరీక్షకు రికార్డు దరఖాస్తులు

Apr 22 2023 6:07 AM | Updated on Apr 22 2023 6:07 AM

Record Applications for NEET Entrance Exam - Sakshi

న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్‌ ప్రవేశ పరీక్ష రాయడానికి ఈ ఏడాది 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశంలోనే అతి పెద్దదైన ఈ ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 20.87 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంఖ్య 2.57 లక్షలు ఎక్కువ.

ఈసారి అమ్మాయిలు ఎక్కువ మంది పరీక్ష రాస్తూ ఉండడం విశేషం. మొత్తం రిజిస్ట్రేషన్లలో అమ్మాయిలు 11.8 లక్షలున్నారు. అబ్బాయిల కంటే 2.8 లక్షలు అధికంగా మెడికల్‌ ఎంట్రన్స్‌ ప్రవేశ పరీక్షకి హాజరుకానున్నారు. మే 7న నీట్‌ పరీక్ష జరగనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా అభ్యర్థులు ప్రవేశ పరీక్షలకు హాజరు కానుండగా, ఆ తర్వాత స్థానంలో యూపీ నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement