ఢిల్లీ: ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగిస్తూ.. బ్రిక్స్ 4 దేశాలతో మొదలై 21 దేశాలకు చేరిందన్నారు. ప్రపంచ జనాభాలో 50 శాతం బ్రిక్స్ దేశాలదే. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తుందన్నారు.
బ్రిక్స్ జీడీపీ 4.5 శాతం పెరిగింది. సుస్థిరాభివృద్ధి, సహకారం, ఇన్నోవేషన్స్కి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. రోడ్డు, రైళ్లు, ఎయిర్పోర్టుల వంటి మౌలిక సదుపాయాల్లో భారత్ వేగంగా విస్తరిస్తోందని మోదీ అన్నారు.


