గడ్చిరోలిలో మావోయిస్టుల డంప్‌ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు

Police Officers Handed Over Maoist Dump At Gadchiroli - Sakshi

కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా కుద్రీ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల డంప్‌ లభ్యమైంది. ప్రత్యేక పోలీస్‌ బలగాలతో గురువారం రాత్రి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ డంపు దొరికిందని ఎస్పీ అంకిత్‌గోయల్‌ తెలిపారు. అందులో రూ.15.96 లక్షల నగదు, మూడు డిటోనేటర్లతో పాటు వైర్‌ బండిళ్లు, వాకీటాకీ, బ్యానర్లు, కిట్‌బ్యాగులు ఉన్నాయని ఆయన శుక్రవారం విలేకరులకు వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top