పార్లమెంట్‌ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని

PM Narendra Modi makes surprise visit to new parliament building - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ గురువారం సాయంత్రం పార్లమెంట్‌ నూతన భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రధాని మోదీ అక్కడ వివిధ విభాగాలు కొనసాగుతున్న పలు పనులను తనిఖీ చేశారు. నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడారు. పార్లమెంట్‌లోని ఉభయసభల్లో కల్పించే వివిధ సదుపాయాలను ఆయన పరిశీలించారు.

అత్యాధునిక హంగులతో  రూపుదిద్దుకుంటున్న పార్లమెంట్‌ భవనానికి ప్రధాని మోదీ 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. గత నవంబర్‌కే ఇది పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీనిని మరికొద్ది రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top