రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు | PM Narendra Modi hosts farewell dinner for outgoing President Ram Nath Kovind | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు

Jul 23 2022 5:23 AM | Updated on Jul 23 2022 11:05 AM

PM Narendra Modi hosts farewell dinner for outgoing President Ram Nath Kovind - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు విందు ఇచ్చారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముతోపాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు.

హోటల్‌ అశోకాలో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురితోపాటు 18 పార్టీల నేతలు కూడా ఉన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement