‘పీఎం సూర్య ఘర్‌’కు కోటి రిజిస్ట్రేషన్లు | Sakshi
Sakshi News home page

‘పీఎం సూర్య ఘర్‌’కు కోటి రిజిస్ట్రేషన్లు

Published Sun, Mar 17 2024 5:19 AM

Over 1 Crore Households Registered Under Rooftop Solar Scheme for Free Electricity - Sakshi

న్యూఢిల్లీ: సుమారు నెల క్రితం ప్రారంభించిన రూఫ్‌ టాప్‌ సోలార్‌ స్కీం ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన’కు అనూహ్య స్పందన వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం కోసం ఇప్పటికే కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అద్భుతమంటూ శనివారం ‘ఎక్స్‌’లో హర్షం వ్యక్తం చేశారు.

అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఇప్పటికీ రిజస్ట్రేషన్‌ చేయించుకోని వారు సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement