దేశ చరిత్రలో అది చీకటి రోజు: మోదీ | No Indian Can Forget This Day | Sakshi
Sakshi News home page

దేశ చరిత్రలో అది చీకటి రోజు: మోదీ

Feb 14 2021 4:32 PM | Updated on Feb 14 2021 4:57 PM

No Indian Can Forget This Day - Sakshi

చెన్నై: రెండేళ్ల క్రితం ఉగ్రమూకలు దొంగలాగా దాడిచేసి 40 మంది భారత జవానులను పొట్టన పెట్టుకున్న రోజు దేశ చరిత్రలో చీకటి రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సరిగ్గా  రెండు సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14 న దాదాపు 2500 మంది సీఆర్‌పీఎఫ్‌ దళాలు 78 బస్సుల్లో జమ్ముకశ్మీర్‌ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. జైషే మహమ్మద్‌ కు చెందిన ఆత్మహుతి దళాలు సీఆర్‌పీఎఫ్‌ బస్సుపై దాడిచేశారు. ఆ ఘటనలో 40 మంది అసువులు బాశారు. తమిళనాడులో పర్యటనలో భాగంగా మోదీ.. ఆరోజు ఘటనను గుర్తుచేసుకొని వారికి ఘననివాళుర్పించారు. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరవదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు చేశారు మోదీ. 

ఈ క్రమంలోనే స్వదేశీ పరిజ్జానంతో అభివృద్ధి చెందిన అర్జున్‌ మెయిన్‌ బాటిల్‌ ట్యాంక్‌ (మార్క్‌1ఎ)ను చెన్నైఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణేకు అందజేశారు. భారత్ ఉన్న రెండు రక్షణ కారిడర్‌లలో ఒకటి తమిళనాడులో ఉంది. దీనికి 8,100 కోట్లను ప్రాథమికంగా నిర్ణయించారు.వీటితోపాటు 9 కిలోమీటర్ల పొడవుగల చెన్నై మెట్రోతోపాటు, రెండు రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపను చేశారు. మద్రాస్‌లో ఐఐటీ క్యాంపస్‌ నిర్మాణానికి వెయ్యికోట్లవుతొందని కూడా అంచనావేశారు. దీనితోపాటు అనైకట్‌ కెనాల్‌ పునర్నిర్మాణ పనులకు కూడా ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement