విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు

Indian govt eases quarantine rules for international travellers - Sakshi

విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ 

8 నుంచి అమల్లోకి...

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. ఆగస్ట్‌ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.

ఆ వివరాలు..
► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా www.newdelhiairport.in లో 7 రోజుల పాటు పెయిడ్‌ ఇన్సిట్యూషనల్‌ క్వారంటైన్‌లో, 7 రోజులు హోం క్వారంటైన్‌లోఉంటామని అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

► కుటుంబంలో ఎవరైనా చనిపోయినవారు, వృద్ధులు, సీరియస్‌ వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలున్నవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండవచ్చు. అయితే, వారు బోర్డింగ్‌కు మూడు రోజుల ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

► ఆర్టీ–పీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చినవారు కూడా ఆ డాక్యుమెంట్‌ చూపించి, 14 రోజుల హోం క్వారంటైన్‌ అవకాశం పొందవచ్చు. ఆ పరీక్ష బోర్డింగ్‌కు గరిష్టంగా నాలుగు రోజుల లోపు జరిపి ఉండాలి.

► అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

► ఎలాంటి కోవిడ్‌–19 లక్షణాలు లేనివారినే బోర్డింగ్‌కు అనుమతిస్తారు.

► భూ సరిహద్దుల ద్వారా వచ్చేవారు కూడా పై నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.  

► ప్రయాణంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించాలి.

► ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్‌–19 లక్షణాలు కనిపిస్తే.. వారిని ఫ్లైట్‌/షిప్‌ గమ్యస్థానం చేరిన వెంటనే కోవిడ్‌ స్పెషల్‌ హెల్త్‌ సెంటర్లకు తరలించి, చికిత్స అందిస్తారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top