సైరన్ల మోత.. మీడియా ఛానెళ్లకు కేంద్రం కీలక సూచన | Govt Tells Media Channels Not To Use Civil Defence Sirens Sounds In Programmes | Sakshi
Sakshi News home page

సైరన్ల మోత.. మీడియా ఛానెళ్లకు కేంద్రం కీలక సూచన

May 10 2025 4:38 PM | Updated on May 10 2025 5:19 PM

Govt Tells Media Channels Not To Use Civil Defence Sirens Sounds In Programmes

ఢిల్లీ: మీడియా ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. సైరన్ల శబ్దాలు వాడొద్దంటూ సూచించింది. అలా వాడితే.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం అవగాహన కార్యక్రమాల్లోని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.

భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌ సంబంధించి స్థానిక, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తోంది. ఈ క్రమంలో పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను న్యూస్‌ కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్‌ డ్రిల్స్‌ సమయంలో మాత్రమే ప్రజలు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement