కంగన ఆఫీస్‌ కూల్చివేత.. గవర్నర్‌ సీరియస్‌! | Governor Summons BMC Officials Over Kangana Office Demolition | Sakshi
Sakshi News home page

బీఎంసీ తీరుపై అసహనం: కేంద్రానికి నివేదిక!

Sep 10 2020 1:48 PM | Updated on Sep 10 2020 2:00 PM

Governor Summons BMC Officials Over Kangana Office Demolition - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీ.. బృహన్ ‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముంబైలోని పాలి హిల్‌లో గల కంగన ఆఫీస్‌ కూల్చివేతకై చేపట్టిన డ్రైవ్. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన వివాదం‌ గురించి కేంద్రానికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుకు గవర్నర్‌ సమన్లు జారీచేసినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌- కంగనా రనౌత్‌ మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపథ్యంలో భారీ భద్రత నడుమ బాలీవుడ్‌ క్వీన్‌ బుధవారం ముంబైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. (చదవండి: 4 రోజుల్లో ముంబైని వీడనున్న కంగన!?)

అదే సమయంలో కంగన బంగ్లాలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ బీఎంసీ కూల్చివేత చర్యలు చేపట్టడం చర్చనీయాంశమైంది. బీజేపీ- శివసేన మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీసిన ఈ ఘటనలో చాలా మంది నెటిజన్లు కంగన వైపే నిలబడి ఆమెకు మద్దతు ప్రకటించారు. ఇదొక కక్షపూరిత చర్య అంటూ ఠాక్రే సర్కారును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్రంగా స్పందించిన కంగనా.. ‘‘ఈరోజు నా ఇంటిని కూల్చారు. రేపు మీ అహంకారం కూలుతుంది’’ అంటూ మండిపడ్డారు.

ఇక ఈ విషయంలో కంగన ముంబై హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆమెకు సంబంధించిన  బిల్డింగ్‌లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది. దురుద్దేశంతోనే బీఎంసీ ఈ పని చేసినట్లుందని మండిపడింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ప్రారంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే సమయం ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement