యోగిజీ ఎఫెక్ట్‌: ప్లీజ్‌.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి

Goon surrenders with placard He Says Dont Shoot Me Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎ‍న్నికల్లో బీజేపీ రెండో దఫా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితంతో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి అధికార పీఠంపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన ఓ యువకుడు ఆందోళనలో ఉన్నాడు. కారణం ఏంటని అంటారా?.. ప్రాణభీతి.

సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌ అధికారంలో ఉన్నప్పుడు క్రిమినల్స్‌ పాలిట సింహస్వప్నం అయ్యారు. వరుస ఎన్‌కౌంటర్‌లలో క్రిమినల్స్‌ను ఏరిపారేయించారు. ఈ తరుణంలో ఆయన రెండోసారి సీఎం అయ్యేసరికి.. తననూ ఎక్కడ ఎన్‌కౌంటర్‌ చేయిస్తాడో అని భయపడుతున్నాడు ఆ వ్యక్తి. తనను చంపొద్దని.. జైల్లో పెట్టాలని వేడుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్‌  సింగ్‌ అనే వ్యక్తి  ఓ కేసులో నిందితుడుగా ఉ‍న్నాడు. ముందస్తుగా లొంగిపోవడమే మంచిదని భావించి.. గౌతమ్‌ సింగ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అదీకాక ‘నేను ఆత్మసాక్షిగా లొంగిపోతున్నా.. నన్ను దయచేసి చంపోద్దు’అంటూ ప్లకార్డు పట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top