హిజాబ్‌ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు

Girl Students Wearing Hijab Denied Entry to Classroom - Sakshi

మంగళూరు (కర్ణాటక): హిజాబ్‌(తలపై ధరించే వస్త్రం)ను ధరించారనే కారణంగా కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కాలేజీలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించ లేదు. ఈ ఘటన ఉడుపిలోని గవర్నమెంట్‌ ఉమన్స్‌ పీయూ కాలేజీలో జరిగింది. తమను ఉర్దూ, అరబిక్‌ భాషల్లో మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపాల్‌ అనుమతించట్లేదని, క్లాస్‌లోకి రానివ్వలేదని ఆరోపించారు. కాలేజీ ప్రాంగణంలో హిజాబ్‌ను అనుమతిస్తామని, క్లాస్‌రూమ్‌లో కుదరదని ప్రిన్సిపల్‌ రుద్ర గౌడ స్పష్టం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top