భారత్‌ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌ సేథ్‌ | Lieutenant General Dheeraj Seth Named As Next Indian Army Chief, Will Take Over On June 30th | Sakshi
Sakshi News home page

భారత్‌ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌ సేథ్‌

Jun 13 2026 5:04 PM | Updated on Jun 13 2026 6:12 PM

general dhiraj seth appointed chief of indian army

సాక్షి,ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ కాలం జూన్ 30 నుంచి ముగుస్తుంది. ఆరోజే ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ సేథ్‌ బాధ్యతలు స్వీకరిస్తారించనున్నట్లు తెలుస్తోంది.

ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా  లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సేవలందిస్తున్నారు, ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (NDA) పూర్వ విద్యార్థి. ఆయన డిసెంబర్ 1986లో ఆయన భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత ఆర్మీకి సేవలందిస్తున్నారు. విస్త్రతశ్రేణి కమాండ్, స్టాఫ్‌,లాంటి పలు వ్యూహత్మక బాధ్యతలు నిర్వహించారు.  

గతంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌ సేథ్‌ గతంలో సాయుధ రెజిమెంట్‌కు, సాయుధ బ్రిగేడ్‌ తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేశారు. ప్రతిష్టాత్మక సుదర్శన్ చక్ర కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్‌ కమాండింగ్‌ జీవోసీగా పని చేశారు. కాగా ప్రస్తుత ఆర్మీ చీఫ్  జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 2024 లో బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement