UP CM Yogi Adityanath: Free Ration Scheme Extended In Uttar Pradesh - Sakshi
Sakshi News home page

UP CM Yogi Adityanath: యూపీ ప్రజలకు సీఎం యోగి భారీ ఆఫర్‌

Mar 26 2022 3:37 PM | Updated on Mar 26 2022 5:43 PM

Free Ration Scheme Extended In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీల్లో భారీ విజయాన్ని అందుకున్న అధికార బీజేపీ పార్టీ శుక్రవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే 52 మందిలో కేబినెట్‌ను విస్తరించారు

ఇదిలా ఉండగా శనివారం మంత్రి మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఉచిత రేషన్‌ పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కాగా, యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పథకమే కీలక పాత్ర పోషించింది. ఇక, సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్‌ అందనుంది.

అయితే, కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్‌ పథకాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం బ్రిజేశ్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందాల‌న్న‌ది త‌మ ఉద్దేశ‌మ‌ని వెల్లడించారు. సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్‌ అందనుంది. మూడు నెలల ఉచిత రేషన్‌ అందిస్తున్నందుకు గాను ప‍్రభుత్వం రూ. 3,270 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement