ఈడీఎల్‌ఐ పరిమితి రూ. 7 లక్షలకు పెంపు

EPF Account Comes With Rs 7 Lakh Free Insurance Cover  - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పథకం(ఈడీఎల్‌ఐ) కింద పొందే గరిష్ట ప్రయోజన పరిమితిని ఈపీఎఫ్‌ఓ రూ. 7 లక్షలకు పెంచింది. దీంతో ఈపీఎఫ్‌ సభ్యులు అనారోగ్యం, యాక్సిడెంట్‌ లేదా సహజ కారణాలతో మరణించినట్లయితే వారి నామినీకి రూ.7 లక్షల వరకు చెల్లిస్తారు. ఈపీఎఫ్‌ఓ సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

గతంలో డెత్‌ ఇన్సూరెన్స్‌ పరిమితి 2–6 లక్షల రూపాయలుండగా, తాజాగా ఈ పరిమితిని రూ.2.5–7 లక్షల రూపాయలకు పెంచినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. మరణానికి 12 నెలల ముందు ఉద్యోగి పొందిన సరాసరి జీతం ఆధారంగా కవరేజ్‌ వర్తిస్తుంది. 

చదవండి:పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top