Earthquake Occurred At Gujarat Dwarka: గుజరాత్‌లో భూకంపం

An Earthquake Occurred At Gujarat Dwarka - Sakshi

ద్వారకలో కంపించిన భూమి

గాంధీనగర్‌: గుజరాత్‌ ద్వారకలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. గురవారం మధ్యాహ్నం 03.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ద్వారకకు వాయవ్య దిశలో 223 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు భూకంప అధ్యయన కేంద్రం(ఎన్‌సీఎస్‌) తెలిపింది. 
(చదవండి: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం)

అసోంలో కూడా గురువారం ఉదయం భూకంపం సంభవించింది. తేజ్‌పూర్‌ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్‌ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదయ్యింది. 

చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top