దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్నంటే?

Coronavirus: 58,077 New Covid Cases Registered India - Sakshi

Coronavirus Update: దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటలలో 58,077 కొత్త  కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,50,407 మంది వైరస్‌ బారినుంచి కోలుకోగా 657 మంది కరోనాతో మృతి చెందారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,177 మంది కోవిడ్‌ బారినపడి మరణించారు. ప్రస్తుతం 6,97,802 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,71,79,51,432 మంది వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top