ముంబైలో రూ.5 కోట్ల కొకైన్‌ పట్టివేత  | Sakshi
Sakshi News home page

ముంబైలో రూ.5 కోట్ల కొకైన్‌ పట్టివేత 

Published Sun, Aug 21 2022 9:07 AM

Cocaine Worth Rs 5 Crore Seized From Woman Passenger At Mumbai - Sakshi

ముంబై: ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌కు చెందిన ఓ మహిళ నుంచి ముంబై విమానాశ్రయం అధికారులు రూ.5 కోట్ల విలువ చేసే 500 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సియర్రాలియోన్‌కు చెందిన ఈ మహిళ ఆడిస్‌అబాబా నుంచి ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో శుక్రవారం ముంబైకి చేరుకుంది. తనిఖీల్లో ఆమె పర్సులో దాచిన కొకైన్‌ బయటపడటంతో అరెస్ట్‌ చేసి, విచారణ జరుపుతున్నట్లు కస్టమ్స్‌ విభాగం అధికారులు చెప్పారు. 
చదవండి: యువతిపై గ్యాంగ్‌ రేప్‌.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం

Advertisement
Advertisement