సాక్షి, హైదరాబాద్: ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ‘మానవ బాంబు’ బెదిరింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. కువైట్ నుంచి శంషాబాద్కు ఈ ఉదయం(మంగళవారం) రావాల్సిన విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు.
గత అర్ధరాత్రి 1.30గం. కువైట్ నుంచి ఇండిగో ప్లైట్ 6ఈ1234 హైదరాబాద్కు బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8.10గం.కి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే బాంబ్ బెదిరింపు మెయిల్తో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు.
అటు విమానం ముంబైలోనూ ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే కాసేపటికి సేఫ్ ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మానవ బాంబు బెదిరింపు నేపథ్యంలో ప్రయాణికులను ఒక్కొక్కరిగా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.


