స్వతంత్ర భారతి: నయా పైసలొచ్చాయి! | Azadi Ka Amrit Mahotsav: Know The Indian Rupee And Paise History | Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారతి: నయా పైసలొచ్చాయి!

Jun 11 2022 1:12 PM | Updated on Jun 11 2022 1:15 PM

Azadi Ka Amrit Mahotsav: Know The Indian Rupee And Paise History - Sakshi

రూపాయికి 100 నయా పైసలుగా నిర్ణయించింది. 1964లో ’నయాపైస’ను ’పైస’గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను ’నాలుగు అణాలు’ అనీ, 50 పైసలను ’ఎనిమిది అణాలు’ అనీ వాడటం అనేక ప్రాంతల్లో కనబడుతుంది.

అణా బ్రిటిష్‌ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు. ఒక అణాకు 6 పైసలు. అర్దణా అంటే మూడు పైసలు. ఈ విధానం ఇండియాకు స్వాతంత్య్రం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో నెహ్రూ ప్రభుత్వం దశాంక విధానం అమలులోకి తెచ్చింది. రూపాయికి 100 నయా పైసలుగా నిర్ణయించింది. 1964లో ’నయాపైస’ను ’పైస’గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను ’నాలుగు అణాలు’ అనీ, 50 పైసలను ’ఎనిమిది అణాలు’ అనీ వాడటం అనేక ప్రాంతల్లో కనబడుతుంది.

1/12 అణా (అణాలో 12వ భాగం లేదా దమ్మిడీ); 1/4 అణా (అణాలో 4వ భాగం, కానీ లేదా పావు అణా); 1/2 అణా (అణాలో సగభాగం లేదా పరక); అణా (6 పైసలు లేదా 1/16 రూపాయలు);  2 అణాలు (12 పైసలు లేదా బేడ); 1/4 రూపాయి (4 అణాలు లేదా పావలా); 1/2 రూపాయి (8 అణాలు లేదా అర్ధ రూపాయి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement