మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి అసదుద్దీన్‌ సవాల్‌  | Asaduddin Owaisi Challenges Madhya Pradesh Govt Meat Exports | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి అసదుద్దీన్‌ సవాల్‌ 

Apr 13 2022 9:59 AM | Updated on Apr 13 2022 9:59 AM

Asaduddin Owaisi Challenges Madhya Pradesh Govt Meat Exports - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి దమ్ముంటే విదేశాలకు మాంసం ఎగుమతులను నిషేధించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. రోజుకు కేవలం వంద నుంచి రెండు వందల రూపాయలు సంపాదించే వారి వ్యాపారాలను మూసివేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం బుల్‌డోజర్లతో ముస్లింల ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి, తగులబెట్టడంపై ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం కూల్చివేతకు పాల్పడిందని ఆయన ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

చదవండి: (ఆరేళ్ల తర్వాత అరుదైన సమావేశం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement