Amarnath Yatra Suspended Due To Bad Weather Conditions - Sakshi
Sakshi News home page

Amarnath Yatra: ప్రతికూల వాతావరణంతో అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్‌

Jul 5 2022 1:26 PM | Updated on Jul 5 2022 2:27 PM

Amarnath Yatra Suspended Due To Bad Weather Conditions - Sakshi

భక్తులెవరినీ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అనుమతించట్లేదని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పహల్గామ్‌ బేస్ క్యాంప్‌ నుంచి భక్తులెవరినీ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అనుమతించట్లేదని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు.

కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జూన్‌ 30న అమర్‌నాథ్‍ యాత్ర ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళ్తుంటారు. అనంత్ నాగ్‌ జిల్లా పహల్గామ్‌లోని నున్వాన్ క్యాంప్‌,  గందర్‌బల్ జిల్లా బాల్‌టాల్‌ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్‍నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేసేవరకు 72,000 మందికిపైగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి రోజున అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement