ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిణామాలపై గురువారం అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలను ఫ్లోర్ లీడర్లకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్షనేత, ఎంపీ మిథున్రెడ్డి హాజరయ్యారు.
ఆఫ్ఘనిస్తాన్ని భారతీయులను, మైనారిటీ హిందువులు, సిక్కులను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరింస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్పై పడే ప్రభావంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.