ఆ సార్‌కి.. డ్యూటీ కంటే మద్యం ముద్దు

Alcohol Addict Govt Employees In Tahsildar Office Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రభుత్వ పనిని దేవుని పనిగా భావిస్తారు. అయితే ఆ పని వదిలేసి ఫుల్లుగా తాగి రోడ్డు మీద పడిపోయాడో ఉద్యోగి. ఈ సంఘటన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. సంజు బెన్నె గొరవనకొళ్ల గ్రామ విలేజ్‌ అకౌంటెంట్‌గా ఉన్నాడు. అయితే విధులకు సరిగా హాజరవకుండా మద్యం తాగి వస్తుండడంతో అతన్ని అక్కడి నుండి తాలూకాఫీసుకు మార్చారు. ఇక్కడా అదే తంతు.

తాగిన మ­త్తులో ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తు­న్నా­డు. బుధవారం కూడా మద్యం తాగి వాహ­నాలు పార్కింగ్‌ చేసే చోట పడిపోయా­డు. ఇ­టువంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు తహసీల్దార్‌ను డిమాండు చేశారు.

చదవండి: పిల్లల్ని కంటారా... లేదంటే ఐదు కోట్లిస్తారా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top