బెంగళూరు : ఎనిమిది నెలల చిన్నారి ఎల్ఇడి బల్బ్ మింగడంతో ప్రాణపాయంలోకి చేరిన ఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. ఓ ఇంట్లో చిన్నారి ఆడుకుంటూ కింద పడి ఉన్న బల్బ్ను మింగి ఊపిరాడక ఏడవసాగింది. కొంతసేపటికి తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించారు. గొంతులో చిక్కుకున్నట్లు గుర్తించారు. ల్యారింగోస్కోప్తో పరీక్షించి బల్బును జాగ్రత్తగా బయటకు తీసి చిన్నారిని రక్షించారు.


