రాజీమార్గంతో కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గంతో కేసుల పరిష్కారం

Apr 11 2025 12:48 AM | Updated on Apr 11 2025 12:48 AM

రాజీమార్గంతో కేసుల పరిష్కారం

రాజీమార్గంతో కేసుల పరిష్కారం

నారాయణపేట: రాజీమార్గంతో కేసులు పరిష్కరించడానికి లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్‌ రఫీ సూచించారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్‌ సమావేశంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి, లీగల్‌ సర్వీసెస్‌ కార్యదర్శి వింధ్య నాయక్‌ మాట్లాడుతూ.. మే 10న జరగాల్సిన లోక్‌ అదాలత్‌ జూన్‌ 14న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఈ లోక్‌ అదాలత్‌లో త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించారు. ఎకై ్స జ్‌, ఇతర కేసులను అన్ని కలిపి 6400 కేసులను లక్ష్యంగా నిర్దేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని ఈ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండా లోని అంశాలను నాన్‌ –బైలాల్‌ వారెంట్‌ కేసులను, చార్జిషీట్‌, పిడి యాక్ట్‌ పెండింగ్‌ లో ఉన్నాయా చర్చించారు. ముందుగా హై కోర్ట్‌ జుడిషియల్‌ ఆదేశానుసారం జైలులో ఉన్న ఖైదీల కేసులను డిస్పోసల్‌ చెయ్యాలని పోలీస్‌ అధికారులకు ఆదేశించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ సురేష్‌ కుమార్‌, బాలప్ప, డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ కె లకి్‌ష్మ్‌పతి గౌడ్‌, నాగేశ్వరి, డీఎస్పీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ జిల్లా లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా రాజేశ్వర్‌గౌడ్‌

నారాయణపేట: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా రాజేశ్వర్‌ గౌడ్‌ నియమిస్తూ టీపీసీసీస లీగల్‌ సెల్‌ చైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్‌ కాపీని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌ రెడ్డి గురువారం రాజేశ్వర్‌గౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చిన లిగల్‌సెల్‌ రాష్ట్ర చైర్మన్‌కు, డీసీసీ అధ్యక్షడు ప్రశాంత్‌కుమారెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలుచిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పీయూలో తరగతుల బహిష్కరణ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడికి వెళ్లిన అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగులు తరగతుల బహిష్కరించారు. ఈ సందర్భంగా భూమయ్య, రవికుమార్‌ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేపట్టిన అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేయడం ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement