
రైతులను ఒప్పించడంలో సఫలం
నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టుకు కావాల్సిన భూ సేకరణలో రాజకీయం చేయకుండా పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం ఫర్నీకరెడ్డి రైతులను సముదాయిస్తూ.. ఒప్పించి, మెప్పించి భూ సర్వేను పూర్తి చేయించడలో సఫలీకృతులయ్యారు. మక్తల్ మండలంలోని కాట్రెవ్పల్లి, యర్నాగన్పల్లి శివారులో, ఊట్కూర్ మండలంలోని బాపూర్లో రైతులు అడ్డుకోవడంతో వారి దగ్గరకు మక్తల్ ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి వారిని మాట్లాడారు. రైతులకు భూ పరిహరం విషయంలో తగిన న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అదే విధంగా దామరగిద్ద మండలంలోని వత్తుగుండ్ల తండాకు చెందిన రైతులు నిరసన బాట పట్టకముందే డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి వారి వద్దకు వెళ్లి ప్రాజెక్టుపై పూర్తిగా అవగాహన కల్పించారు. జాజాపూర్, నారాయణపేట, దామరగిద్ద మండలంలోని రైతులను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఒప్పించి ఈ ప్రాంత రైతుల కల నేరవేరబోతుందని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.