
‘ నాకు ప్రాణహాని ఉంది’
● వరసిద్ధి వినాయక స్వామి ఆలయ నిర్వాహకుడి సెల్ఫీ వీడియో వైరల్
బనగానపల్లె: తనకు ప్రాణహాని ఉందని పాతపాడు – యాగంటి క్షేత్ర రహదారిలో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం నిర్వాహకుడు వలిస్వామికి చెందిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వలిస్వామి గత 25 ఏళ్లుగా దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అయితే గత రెండు నెలలుగా కొందరు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో బెదిరిస్తున్నారని వీడియోలో ఆరోపించారు. ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలం విలువ రూ. కోట్లు చేస్తుందని, ఎలాగైనా ఆలయాన్ని ఆక్రమించుకోవాలని కొందరు కుట్ర పన్నుతున్నట్లు ఆయన వాపోయారు. ఈ విషయాన్ని తాను కొందరి పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.